భార్య వుండగానే రెండో పెళ్లి.. ఆపై వేధింపులు.. హత్యాయత్నం.. చివరికి?

శుక్రవారం, 21 ఆగస్టు 2020 (20:15 IST)
భార్య వుండగానే రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య వుందనే విషయం చెప్పకుండానే రెండో పెళ్లి చేసుకోవడంతో రెండో భార్య నిలదీసింది. దీంతో ఆ భర్త రెండో భార్యను వేధించడం మొదలెట్టాడు. ఓ దశలో ఆమెను వదిలించుకునేందుకు మేడపై నుంచి తోసి హత్య చేసేందుకు యత్నించాడు. ఆ తర్వాత కనిపించకుండాపోయాడు. ఈ ఘటన తిరుపతి రూరల్ మండలం తుమ్మలకుంటలో జరిగింది. 
 
వివరాల్లోకి వెళితే.. తిరుపతి రూరల్ మండలం తుమ్మలకుంటకు చెందిన కృష్ణవేణికి ఇద్దరు పిల్లలు. 2012లో భర్తతో విబేధాలు వచ్చి విడాకులు తీసుకుంది. ఆ తర్వాత పిల్లలతో కలిసి ఎల్ఎస్ నగర్‌లో ఉండేది. అదే బిల్డింగ్‌లో రాజేష్ అనే బ్యాంక్ ఉద్యోగి ఉండేవాడు. కృష్ణవేణి పరిస్థితి తెలుసుకుని పరిచయం పెంచుకున్నాడు. తన భార్య నుంచి విడాకులు తీసుకున్నట్టు నమ్మించాడు. 
 
కృష్ణవేణిని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. గత ఏడాది పెళ్లికూడా చేసుకున్నాడు. కొన్ని నెలల కాపురం తర్వాత రాజేష్‌లో అసలు మనిషి బయటపడ్డాడు. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే తనను పెళ్లి చేసుకున్నాడని కృష్ణవేణి తెలుసుకుంది.
 
ఇదే విషయమై రాజేష్‌ను నిలదీయడంతో వివాదమైంది. అంతేగాకుండా తనను వదిలించుకునేందుకు రాజేష్ ప్రయత్నించాడని కృష్ణవేణి ఆరోపించింది. నిద్రలో ఉన్న సమయంలో రెండో అంతస్తు నుంచి కిందపడేశాడని తెలిపింది. దీంతో అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు