Kavamma: అమ్మవారికి గుమ్మడికాయతో దిష్టి తీస్తూ గుండెపోటుతో కుప్పకూలి భక్తుడు మృతి (video)

సెల్వి

సోమవారం, 2 జూన్ 2025 (14:12 IST)
Man
తిరుపతి- వెంకటగిరి కావమ్మ తిరునాళ్లలో విషాదం చోటుచేసుకుంది. ఈ తిరునాళ్లలో భాగంగా అమ్మవారి ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మవారి ఊరేగింపులో శోభన్ బాబు అనే వ్యక్తి అమ్మవారికి దిష్టి తీస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. 
 
దీన్ని గమనించిన స్థానికులు అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. కాగా ఈ తిరునాళ్లలో భక్తులు కంకణాలు ధరించి, అగ్ని గుండం ప్రవేశం చేస్తారు. కావమ్మ, మారెయ్య జీవిత చరిత్రను భక్తులకు వినిపిస్తారు. 

తిరునాళ్లలో అమ్మవారికి దిష్టి తీస్తూ గుండెపోటుతో వ్యక్తి మృతి

తిరుపతి - వెంకటగిరిలో కావమ్మ తిరునాళ్లలో భాగంగా నిన్న రాత్రి అమ్మవారి ఊరేగింపులో అమ్మవారికి దిష్టి తీస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయిన శోభన్ బాబు అనే వ్యక్తి

వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు… pic.twitter.com/caakRfU1Q4

— Telugu Scribe (@TeluguScribe) June 1, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు