ఏలూరులో టెన్షన్ టెన్షన్ : ఆస్పత్రి నుంచి కరోనా ఖైదీ రోగులు ఎస్కేప్

శనివారం, 25 జులై 2020 (14:05 IST)
ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లా ఏలూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇద్దరికి కరోనా పాజిటివ్ ఖైదీ రోగులు ఆస్పత్రి నుంచి పారిపోయారు. ఇది స్థానికంగా కలకలం రేపింది. స్థానికంగా ఉండే జైలులో శిక్షలు అనుభవిస్తున్న ఖైదీలకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. 
 
ఈ పరీక్షల్లో ఇద్దరికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో వీరిని స్థానిక సీసీఆర్ పాలిటెక్నిక్ కోవిడ్ కేర్ సెంటర్‌కు తరలించి చికిత్స అందిస్తూ వచ్చారు. అయితే, శనివారం తెల్లవారుజామున ఇద్దరు కరోనా పాజిటివ్ ఖైదీలు పత్తాలేకుండా పారిపోయారు. 
 
ఈ విషయాన్ని కోవిడ్ కేర్ సెంటర్ అధికారులు ఏలూరు మూడో పట్టణ పోలీసులకు సమాచారం చేరవేశారు. సమాచారం అందుకున్న పోలీసులు... పారిపోయిన ఖైదీల కోసం బస్టాండు తదితర ప్రాంతాల్లో గాలిస్తున్నారు. కరోనా సోకిన ఖైదీలు పారిపోవడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు