అన్నీ శుభాలే... ఏపీలో మళ్లీ వైసీపీ సర్కారే కొలువు దీరుతుంది

శనివారం, 2 ఏప్రియల్ 2022 (15:23 IST)
తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు సీఎం జగన్ సతీసమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ ఆస్థాన సిద్ధాంతి కప్పగంతు సుబ్బరామ సోమయాజి పంచాంగ పఠనం చేశారు. చాలా మంచి పథకాలతో ప్రజలకు దగ్గరయ్యే అవకాశం ఈ ప్రభుత్వానికి దొరుకుతుందన్నారు. 
 
శుభకృత్ నామసంవత్సరంలో పేరుకు తగ్గట్లే ప్రభుత్వానికి అన్ని మంచి శుభాలే జరుగుతామని సిద్ధాంతి కప్పగంతు సుబ్బరామ సోమయాజి తెలిపారు. ఏపీలో మరోసారి వైసీపీ ప్రభుత్వమే వస్తుందని సిద్ధాంతి కప్పగంతు సుబ్బరామ సోమయాజి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, వైసీపీ కీలక నేతలు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు