గత కొద్ది రోజులుగా వల్లభనేని వంశీ శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న విషయంతెల్సిందే. దీంతో కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు మూడు రోజుల క్రితం విజయవాడలోని ఆయుష్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ వైద్యుల బృందం ఆయనకు ప్రత్యేక చికిత్స అందించారు. శ్వాస తీసుకోవడంలో ఉన్న ఇబ్బందులకు సంబంధించి అవసరమైన వైద్య సేవలు చేశారు.
ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి సాధారణస్థితికి చేరుకుందని వైద్యులు నిర్ధారించారు. దీంతో సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసేందుకు అనుమతించారు. కాగా, వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితిపై సమగ్రమైన నివేదికను ఈ నెల 5వ తేదీన కోర్టుకు సమర్పించనున్నట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.