మంచు లక్ష్మి... సీనియర్ నటుడు మోహన్ బాబు ముద్దుల పుత్రిక. వెండితెరపై నటిగానే కాకుండా బుల్లితెరపై యాంకర్గా ఆకట్టుకుంది. అలాగే, 'నేను సైతం' అనే కార్యక్రమం ద్వారా ఎందరికో దారి చూపి వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతోంది. ఈమె త్వరలోనే రాజకీయరంగ ప్రవేశం చేయనున్నారు.
ప్రస్తుతం వైకాపాలో సినీ నటి ఆర్కే.రోజా ఎమ్మెల్యే గా పనిచేస్తున్నారు. ఈమెకు పోటీగా మంచు లక్ష్మిని బరిలోకి దించాలని టీడీపీ ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా.. చంద్రగిరి స్థానం నుంచి లక్ష్మి నిబరిలోకి దింపాలని ఆలోచిస్తున్నట్లుగా సమాచారం. చిత్తూరు జిల్లాలోని టీడీపీ తరఫున గట్టిగా మాట్లాడే మహిళా నేత లేకపోవడంతో, వైసీపీ రోజా కాస్త స్వరం పెంచుతుందని, ఆమె స్వరం తగ్గించాలంటే మంచు లక్ష్మి అయితేనే కరెక్ట్ అని తెలుగుదేశం నాయకులూ భావిస్తున్నారట.