ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దివ్యదర్శనం పథకాన్ని ప్రారంభించారు. దివ్యదర్శనం పథకం కింద ఏపీలోని 8 పెద్ద దేవాలయాలను భక్తులు దర్శించుకునే అవకాశం కల్పిస్తారు. ప్రతిజిల్లాలో నాలుగు ప్రత్యేక బస్సులను దేవాదాయ శాఖ ఏర్పాటు చేసింది. రవాణా ఖర్చుతో పాటు భక్తులకు ఉచితంగా దర్శనం, వసతి, భోజనం వసతులు కల్పిస్తారు. సోమవారం ఉదయం విజయవాడలో సీఎం చేతుల మీదుగా ఈ పథకం ప్రారంభమైంది.
ఈ పథకం ప్రారంభించిన సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. దివ్యదర్శనం కార్యక్రమాన్ని ప్రారంభించిన దేవాదాయశాఖను అభినందిస్తున్నానని వెల్లడించారు. రేషన్కార్డు ఉంటే చాలు ఈ పథకం కింద రవాణా, దర్శనం, వసతి, భోజనం ఉచితంగా కల్పిస్తారని వెల్లడించారు.