రోహు చేపకు బీరు తాగించిన ప్రబుద్ధుడు (Video)

ఠాగూర్

బుధవారం, 26 ఫిబ్రవరి 2025 (15:01 IST)
ప్రజలు ఎంతో ఇష్టంగా ఆరగించే చేపల్లో రోహు రకం చేప ఒకటి. ఆ చేపకు ఓ ప్రబుద్ధుడు బీరు తాగించారు. ప్రజలు ఎంతో ఇష్టంగా ఆరగించే ఈ చేప పది కేజీలకు పైగా బరువు పెరుగుతుంది. అలాంటి చేపకు ఓ ప్రబుద్ధుడు బీరు తాగించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 
 
రోహు చేపను ఓ చేత్తో పట్టుకుని, మరో చేతిలో బీరు సీసా ఎత్తి ఆ చేపకు తాగించాడు. ఈ వీడియో సామాజిక మధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు అతగాడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
చేపకు బీరు తాగించడం ఏంటంటూ మండిపడుతున్నారు. ప్రాణాల పట్ల ఎవరైనా హింసకు పాల్పడితే వారిపై పోరాటాలు చేసే పెటా సంస్థ ఈ వీడియోపై దృష్టిసారించాలని, సదరు వ్యక్తిపై తగిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rare Indian clips (@indianrareclips)

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు