మాజీ మంత్రి, వైకాపా నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ పూర్తయిందని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కోర్టుకు తెలిపింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు వెల్లడించింది. ఈ హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితుల్లో వైకాపాకు చెందిన కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఒకరు. ఈ కేసులో ఆయనను అరెస్టు చేయకుండా గతంలో కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
అలాగే, వివేకా కుమార్తె సునీత తరపున సీనియర్ కౌన్సిల్ మరో కోర్టులో ఉండటంతో విచారణకు న్యాయవాది సమయం కోరారు. దీంతో ధర్మాసనం పాస్ ఓవర్ చేసింది. ఆ తర్వాత వాదనలు వినిపించేందుకు సిద్ధమని సునీత తరపు న్యాయవాది లూథ్రా ధర్మాసనానికి విన్నవించారు. భోజనం విరామం తర్వాత బెంచ్ కొనసాదడం లేదని, అందువల్ల మరోరోజు విచారణ చేపడుతామని జస్టిస్ సుందరేశ్ తెలిపారు. దీంతో తదుపరి విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేశారు.