ప్రేమించి పెళ్లాడి... భ‌ర్త చేతిలో మోసపోయి... ఓ త‌ల్లి దీన‌గాధ ఇది!

గురువారం, 30 డిశెంబరు 2021 (12:22 IST)
ఈమె పేరు కస్తూరి మాధవి. ఊరు గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరు. ఆర్.టీ.ఓ ఆఫీస్ వద్ద రోడ్డు మీద చిన్న గుడిసెలో నివాసం ఉంటోంది. ప్రేమ పేరుతో మోసం చేసి ఓ అబ్బాయి ఈమెతో ముగ్గురు పిల్లల్ని కన్నాడు. మొదటి కాన్పులో ఒక బాబు, రెండవ కాన్పులో ఇద్దరు కవలలు పుట్టారు. ఇక మోజు తీరిన భర్త ఈమెను, పిల్లల్ని వదిలి అనాధ‌లను చేసి ఇల్లు వదిలి పారిపోయాడు. ఈ విషయం స్థానిక పోలీసులకు క‌స్తూరి ఫిర్యాదు చేసింది. కానీ, పోలీసులు ఎవరూ ఆమె విషయం పట్టించుకోలేదు. నేను అణగారిన వర్గానికి చెందిన చాలా పేద అమ్మాయిని, నాకు దిక్కెవ‌రు అని క‌స్తూరి రోధిస్తోంది.
 
 
ఇప్పుడు నా బిడ్డలకు నా ద్వారా తల్లి పాలు సమస్య ఏర్పడింది. వారి పోషణకు నా ఆర్ధిక సమస్య పెద్ద కారణం అయ్యింది. నన్ను ఆదరించే వారు ఎవరూ లేరు. ఉన్నరోజు, లేనిరోజు అని చూడకుండా నా పసి బిడ్డలకు పాల కోసం నేను ఎన్నో కష్టాలు పడుతున్నాను.కేవలం పిల్లల సంరక్షణ  కోసం మంగళగిరిలో చాలా చిన్న జీతానికి బట్టల షాపులో పని చేస్తున్నాను. 3 నెలల పసికందులను ఇంటిలో వదిలి ఉదయం నుండి రాత్రి పొద్దుపోయే వరకు షాపులో పనిచేయడం కూడా చాలా కష్టంగా ఉంది. 
 
 
మా అమ్మ నాకు తోడుండటంతో ఆ పని అయినా చేసుకోగలుగుతున్నాను. నా పసి బిడ్డల ఆకలి ఏడుపులు నన్ను చాలా భాధిస్తున్నాయి. నా పెద్ద బాబు వచ్చి రాని మాటలతో నోటి వద్ద చేయి పెట్టి తింటా, తింటా అని చేయి ఊపుతుంటే వారికి సరియైన ఆహారం అందించలేని స్థితిలో ఉన్న నాకు, మా అమ్మకు ప్రాణం చచ్చిపోతుంది. అన్నల్లారా, అక్కల్లారా,నేను మిమ్మల్ని ఏ విధమైన పెద్ద సాయం కోరడం లేదు. పసిబిడ్డల ఆకలి తీర్చేందుకు వారికి అవసరం అయిన పాల డబ్బాల ఖర్చు సాయమే మీరు  నాకు ఇచ్చే కొండంత ధైర్యం నా పిల్లలకు ఆసరా. దయచేసి నాకు ఆర్ధిక సాయం అందించండని వేడుకుంటోంది క‌స్తూరి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు