వివరాల్లోకి వెళితే.. 1,600 మీటర్ల పరుగు తర్వాత శ్వాసకోశ సమస్యల కారణంగా సాయి కిరణ్ కుప్పకూలిపోయాడు. వెంటనే అతన్ని అంబులెన్స్లో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతను శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడినట్లు సమాచారం. సాయంత్రం తరువాత మరణించినట్లు పోలీసులు తెలిపారు.
రైతు అప్పల నాయుడు, భారతి దంపతుల కుమారుడు అయిన సాయి కిరణ్ ఇటీవల డిగ్రీ పరీక్షలలో అర్హత సాధించి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్మీ ర్యాలీలో తమ కుమారుడు మరణించడం పట్ల రోదిస్తున్నారు. ర్యాలీలో కుప్పకూలిన తమ కొడుకుకు సరైన వైద్యం అందలేదని, అందుకే అతను మరణించాడని ఆరోపించారు.