ఏంటో మరి.. మా జగన్ రెడ్డి లాజిక్కు : సినిమా టిక్కెట్ వార్‌పై "ఆర్ఆర్ఆర్"

శుక్రవారం, 24 డిశెంబరు 2021 (14:47 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఇపుడు సినిమా టిక్కెట్ ధరలను తగ్గిస్తూ సీఎం జగన్ రెడ్డి సర్కారు తీసుకున్న నిర్ణయంపై చుట్టూ తిరుగుతున్నాయి. ఈ సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు క్రమంగా తెలుగు చిత్రపరిశ్రమ పెద్దల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తున్నాయి. ఈ అంశంపై ఇప్పటికే టాలీవుడ్‌లో ఆగ్రహ జ్వాలలు చెలరేగుతున్నాయి. ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్కొక్కరు తమ నిరసన కళం విప్పుతున్నారు. 
 
తాజాగా వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పందించారు. ఏంటో మరి.. నాణ్యతా ప్రమాణాల కోసం మీ పత్రిక రైట్లు పెంచుకోవచ్చు. మీ సిమెంట్ రేట్లు పెంచుకోవచ్చు కానీ, సినిమా టిక్కెట్ రేట్లు తగ్గిస్తారా? అంటూ వ్యాఖ్యానించారు. ఇపుడు రఘురామ రాజు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. 


 

ఏంటో మరి!

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు