నడుము నొప్పిని కటిశూల అని ఆయుర్వేదంలో పిలుస్తారు. నడుంనొప్పి ఉన్నవాళ్ళు మొదట మూడు రోజులు ద్రవాహారం తీసుకుంటూ ఉపవాసంచేస్తే, జీర్ణాగ్ని సరిగ్గా తయారై కడుపులో ఆమం తగ్గి విష పదార్థాలు బయటకు వెళతాయి.ఆ తరువాత బరువైన ఆహారం తీసుకోకుండా ఉంటే అన్ని దోషాలూ తగ్గుతాయి.
అల్లం రసం, పసుపు కలిపి పాలతో తీసుకుంటే జీర్ణకోశం బాగుపడి నడుం నొప్పి తగ్గుతుంది. ఆవ నూనె, నువ్వుల నూనె వేడి చేసి నడుముకు మర్దన చేసుకుని వెడి నీళ్ళతో స్నానం చేస్తే నడుం నొప్పి తగ్గుతుంది. వంకాయ, వేరుసెనగ నూనె, మినప పదార్థాలు, పెరుగు ఎక్కువగా తీసుకోవడం మంచింది కాదు.
ఒళ్ళు లావుగా వుండి నడుంనొప్పి వుంటే, పావుగ్లాసు గోరువెచ్చని నీళ్ళలో ఇరవై చుక్కలు నిమ్మపండు రసం పోసి పరగడుపున త్రాగుతుంటే, ఒళ్ళు తేలిక పడి నొప్పి తగ్గుతుంది. ఒక నిమ్మకాయ కోసి ఒక చెక్కను పల్చటి గుడ్డలో కట్టి మూకుడులో ఆవు నెయ్యి వేసి కాచి అందులో ఈ కట్టిన గుడ్డను మంచి నడుంచూట్టూ కాపు పెడుతుంటే, నడుంనొప్పి తగ్గిపోతుంది.