ప్రతిరోజు రాత్రిపడుకునే ముందు బాదం నూనెలో కొద్దిగా నిమ్మరసం కలుపుకొని ముఖానికి పట్టించాలి. ఉదయం లేవగానే ముఖం కడిగితే కాంతివంతంగా మారుతుంది. కలబంద జెల్ జ్యూస్ని తీసుకొని ముఖానికి, మెడ భాగంలో రాసి పడుకొని ఉదయం లేవగానే కడిగేసుకుంటేముఖంపై ఉన్న ముటిమలు, మచ్చలు తొలగిపోయి ముఖం నిగనిగలాజడుతుంది.
ప్రతిరోజూ కొబ్బరి నూనెతో ముఖానికి మర్దన చేసుకోవాలి. ఉదయం లేచిన తర్వాత కడుక్కోవాలి. ఇలా చేస్తే... ముఖం కోమలంగా మారుతుంది. ఒక స్పూన్ టమోటా జ్యూస్లో, ఒక టీ స్పూన్ తేనె కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసి ఉదయం లేవగానే కడిగితే ముఖంలో కొత్త మెరుపు సంతరించుకుంటుంది.