అమేజాన్ పే యుపిఐతో 10 కోట్ల భారతదేశ వినియోగదారుల డిజిటల్ చెల్లింపులు

ఐవీఆర్

సోమవారం, 26 ఆగస్టు 2024 (18:38 IST)
100 మిలియన్‌కు పైగా కస్టమర్లు ఇప్పుడు సేవలను ఉపయోగిస్తున్నందున దేశవ్యాప్తంగా అమేజాన్ పే యూపీఐని విస్తృతంగా అనుసరిస్తున్నారు. ప్రముఖ వాడకం కేసులలో మొబైల్ రీఛార్జీలు, యుటిలిటి బిల్లు చెల్లింపులు, ఇ-కామర్స్ లావాదేవీలు ఉన్నాయి. ఈ సమగ్రమైన చెల్లింపు పరిష్కారం తన లైట్నింగ్-ఫాస్ట్ లావాదేవీలు (3.5 సెకంట్ల లోపు), ఐఫోన్ పై తక్కువ-లైటింగ్ స్కానింక్ కోసం ఆటో-టార్చ్, నిరంతరంగా రిమైండర్స్, బిల్లు చెల్లింపుల నిర్వహణ, 10,000+కి పైగా ఆన్ లైన్ నుండి బహుమానపూర్వకమైన ఆఫర్లు, బహుళ ఆఫ్ లైన్ బ్రాండ్స్ ద్వారా సౌకర్యాన్ని అందిస్తోంది.
 
అమేజాన్ పే యుపిఐ గణనీయమైన విజయంగా మారింది, Amazon షాపింగ్ యాప్ పైన, బయటి ప్లాట్‌ఫాంల విస్తృత శ్రేణిలో రెండిటిలో లావాదేవీలను సాఫీ చేస్తుంది. ఈ నిరంతర సమీకృత విధానం తమ డిజిటల్ చెల్లింపులను సులభంగా నిర్వహించడంలో యూజర్లకు సహాయపడుతోంది, ప్రతిరోజూ లావాదేవీలను మరింత సురక్షితమైనవిగా, సౌకర్యవంతంగా చేసింది. 2019లో ఇది ప్రారంభమైన నాటి నుండి, అమేజాన్ పే యుపిఐ మహారాష్ట్ర, యుపి, బీహార్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక వంటి పెద్ద రాష్ట్రాల నుండి శక్తివంతమైన యూజర్ ప్రాధాన్యతను ముఖ్యంగా టియర్ 2, 3లలో పొందింది, డిజిటల్ కోసం విస్తరణ యాక్సెస్ కలిగి ఉంది. ముఖ్యంగా, 18-24 సంవత్సరాల వయస్సు గల వారు అమేజాన్ పే యుపిఐని అనుసరిస్తున్నారు.
 
ఈ విజయం గురించి మాట్లాడుతూ, వికాస్ బన్సల్, సిఈఓ, అమేజాన్ పే ఇండియా, ఇలా అన్నారు, “తమ కస్టమర్ల కోసం సురక్షితమైన, వేగవంతమైన, అంతటా విస్తరించిన, బహుమానపూర్వకమైన చెల్లింపు అనుభవం అందించడానికి అమేజాన్ పే కట్టుబడింది. కస్టమర్లు ఆన్‌లైన్‌లో లావాదేవీ చేసే విధానాన్ని యుపిఐ విప్లవీకరించింది, మేము యుపిఐ వ్యవస్థలో వాలెట్- ఆన్-యుపిఐ, యుపిఐపై క్రెడిట్ లైన్ వంటి అవకాశాలు సహా విస్తృతమైన, చేరని, పొందని ప్రయోజనం చూసాము. ఆన్లైన్ చెల్లింపు అనుభవానికి తాము ప్రాధాన్యతనిచ్చిన ఎంపికగా 100 మిలియన్ కస్టమర్లు అమేజాన్ పే యుపిఐని ఎంచుకున్నందుకు మేము గర్వస్తున్నాము, వినమ్రంగా ఉన్నాము. జీవితాలను సరళం చేయడానికి, భారతదేశం అంతటా ఉన్న లక్షలాది మంది అభిలాషలు నెరవేర్చడానికి మా ఆఫరింగ్స్‌ను ఆవిష్కరించి, విస్తరించడాన్ని కొనసాగించడానికి మేము ఉత్సాహంగా ఉన్నాము.”
 
ఇటీవల, కెర్ని ఇండియా- అమేజాన్ పే ఇండియా 120 నగరాల్లో, 7,000 మంది జవాబులు ఇచ్చిన వారితో ‘హౌ అర్బన్ ఇండియా పేస్’ అనే పేరుతో పరిశోధనను చేపట్టాయి. ఈ నివేదిక ప్రకారం, యుపిఐ ఆధిపత్యాన్నివహించడం కొనసాగించింది, 53% వినియోగదారులు తమ ఆన్లైన్ కొనుగోళ్ల కోసం ప్రాధాన్యత ఇవ్వగా, 25% మంతి తమ ఆఫ్ లైన్ కొనుగోళ్ల కోసం ప్రాధాన్యతనిచ్చారు. ఇంకా, దక్షిణ భారతదేశంలో 36% వినియోగదారులు నగదుకు బదులు యుపిఐకి ప్రాధాన్యతనివ్వగా తదుపరి స్థానాలను పశ్చిమ, ఉత్తర-మధ్య (35%), ఈశాన్య (32%), తూర్పు (31%) భారతదేశం ప్రాంతాలు ఆక్రమించాయని ఈ నివేదిక గుర్తించింది. ఈ తెలుసుకున్న విషయాలు ఆయా ప్రాంతాల్లో యుపిఐపై పెరుగుతున్న నమ్మకాన్ని తెలియచేసాయి, భారతదేశంలో గొప్ప సౌకర్యం, ఆర్థిక చేరికకు వాగ్థానం చేసే దృఢమైన, విస్తరించే డిజిటల్ చెల్లింపు వ్యవస్థకు సంకేతాన్ని ఇచ్చాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు