చికాగో విమానాశ్రయం నుంచి శంషాబాద్‌కు ఫ్లైట్.. ఇక నాన్ స్టాప్ సేవలు

శుక్రవారం, 15 జనవరి 2021 (13:57 IST)
చికాగో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తొలిసారి నేరుగా వచ్చిన ఎయిర్‌ ఇండియా విమానం శంషాబాద్‌ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. చాలా కాలంగా కలగా ఉన్న హైదరాబాద్‌-అమెరికా మధ్య నాన్‌స్టాప్‌ విమాన సర్వీసులు శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి.

రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం సురక్షితంగా ల్యాండ్‌ అవడంపట్ల అధికారులు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. 
 
238 సీట్ల సామర్థ్యం కలిగిన ఈ విమానంలో ఎనిమిది ఫస్ట్‌క్లాస్‌, 35 బిజినెస్‌ క్లాస్‌, 195 ఎకానమీ సీట్లు ఉన్నాయి. వీటితోపాటు నలుగురు కాక్‌పిట్‌, 12 మంది క్యాబిన్‌ క్రీవ్‌ సిబ్బంది ఉన్నారు. విమానాన్ని నడిపిన నలుగురు పైలట్లను శంషాబాద్‌ విమానాశ్రయంలో అధికారులు ఘనంగా సన్మానించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు