ఏపీలో వాణిజ్య ఉత్సవ్‌ను ప్రారంభించిన సీఎం జగన్

మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (12:49 IST)
విజయవాడలో ఏర్పాటు చేసిన వాణిజ్య ఉత్సవాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఏపీలో ఎగుమతుల వృద్దే లక్ష్యంగా ఈ వాణిజ్య ఉత్సవ్‌ జరుగుతోంది. రెండు రోజుల పాటు సాగే ఈ భారీ వాణిజ్య సదస్సును అజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఈ జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు. 
 
విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్‌ సెంటర్‌లో సెమినార్ జరుగుతోంది. ఈ సందర్భంగా అధికారులు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సీఎం జగన్‌ పరిశీలించారు. ఉత్పత్తులకు సంబంధించి పలు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
 
ప్రస్తుతం ఏపీ నుంచి 4 ఓడరేవుల ద్వారా ఎగుమతులు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా ఏపీ నుంచి 16.8 బిలియన్‌ డాలర్ల విలువైన ఎగుమతులు జరుగుతున్నాయి. 2030 నాటికి 33.7 బిలియన్‌ డాలర్ల ఎగుమతులే లక్ష్యంగా చర్యలు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు