ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేస్తూ బటన్ నొక్కితే 1 కేజీ సిమెంట్: బంగూర్ సిమెంట్

ఐవీఆర్

శుక్రవారం, 19 ఏప్రియల్ 2024 (20:17 IST)
దేశంలోని ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా స్పూర్తినిస్తూ కొత్త మల్టీమీడియా ప్రచారాన్ని బంగూర్ సిమెంట్ ప్రారంభించింది. 'ఓట్ సాలిడ్, దేశ్ సాలిడ్' అనే ఈ  ప్రచారం, దేశాన్ని మరింత పటిష్టంగా చేయడంలో ప్రతి వ్యక్తి ఓటు యొక్క విలువను వెల్లడిస్తుంది. ఈ ప్రచారం వినూత్నమైనది ఎందుకంటే ఇది ప్రముఖ బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ నటించిన మునుపటి బ్రాండ్ లాంచ్ ప్రచారానికి సీక్వెల్‌‍గా ఇది వచ్చింది. 
 
‘ఓట్‌ సాలిడ్‌, దేశ్‌ సాలిడ్‌’ అన్నది ప్రచారంలోని కీలక సందేశం. మీరు పటిష్టమైన ఇంటిని నిర్మించడంలో బంగూర్‌ సిమెంట్‌ సహాయం చేసినట్లే, మీరు మీ ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా పటిష్టమైన దేశాన్ని నిర్మించడంలో సహాయపడగలరనే సందేశం ఇది అందిస్తుంది. 
 
ఇంకా, బ్రాండ్ తన వెబ్‌సైట్ లోని “వోట్ కా వచన్” బటన్ ద్వారా “ఓటు వేయాలనే ఉద్దేశ్యం" తెలుపమని  ప్రజలను ప్రోత్సహిస్తుంది. ఓటు వేస్తామని చేసే ప్రతి ప్రతిజ్ఞకు 1 కేజీ సిమెంటును విరాళంగా అందజేస్తానని బంగూర్ సిమెంట్ ప్రతిజ్ఞ చేసింది, దానిని సామాజిక సంక్షేమ ప్రయోజనాల కోసం వినియోగిస్తారు. బంగూర్ సిమెంట్ ఈ ప్రతిజ్ఞను నెరవేర్చడంలో సహాయపడటానికి సంబంధిత NGOలు, స్వయం సహాయక బృందాలతో చేతులు కలిపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు