షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

దేవీ

బుధవారం, 23 జులై 2025 (19:25 IST)
Adivi Sesh and Mrinal Thakur
మేజర్ ఫేమ్ అడివి శేష్ 'డకోయిట్' అనే యాక్షన్ డ్రామా సినిమాను చేస్తున్నాడు. నాయికగా శ్రుతి హాసన్ తప్పుకున్న తర్వాత మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో జాయిన్ అయ్యారు. ఇంతకుముందు కొంత పార్ట్ షూట్ జరిగింది. కొంత గేప్ తర్వాత ప్రస్తుతం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈరోజు సినిమా సెట్స్‌లో యాక్షన్ సీన్స్ చిత్రీకరిండగా, అడివి శేష్, మృణాల్ ఠాకూర్ ఇద్దరూ గాయపడ్డారు. అడివి శేష్ మరియు మృణాల్ ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి కానీ వారు 'డకోయిట్' షూటింగ్‌ను కొనసాగారు.
 
షాట్ చిత్రీకరణ తర్వాత అడివి శేష్ విరామం తీసుకుని వైద్యుడిని సందర్శిస్తారు. సినిమాటోగ్రాఫర్ షనీల్ డియో ఈ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. అడివి శేష్, షనీల్ డియోతో కలిసి స్క్రిప్ట్‌పై పనిచేశారు. ఈ సినిమా ఈ సంవత్సరం క్రిస్మస్ సందర్భంగా విడుదల అవుతుంది. సుప్రియా యార్లగడ్డ డకోయిట్‌ను నిర్మిస్తోంది. ఈ చిత్రం తెలుగు మరియు హిందీ భాషలలో విడుదల కానుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు