పెట్రోల్ ధర తొలిసారిగా రూ.100 మార్కును తాకింది.. దేశ చరిత్రలోనే..?

గురువారం, 28 జనవరి 2021 (12:52 IST)
భారత దేశ చరిత్రలో పెట్రోలు ధర తొలిసారిగా రూ. 100 మార్క్‌ను తాకింది. గురువారం రాజస్థాన్‌లో బ్రాండెడ్ పెట్రోల్ ధర సెంచరీని అధిగమించింది. గురువారం చమురు సంస్థలు పెట్రోలు ధరను 25 పైసల మేరకు పెంచడంతో, ఆ మేరకు దేశవ్యాప్తంగా ధరలు పెరిగాయి. దీంతో రాజస్థాన్ లోని శ్రీగంగానగర్ లో బ్రాండెడ్ పెట్రోలు ధర సరిగ్గా రూ. 101.15ను తాకింది. ఇక సాధారణ పెట్రోలు ధర దేశవ్యాప్తంగా రూ. 95 నుంచి రూ.89 మధ్య కొనసాగుతున్నాయి. 
 
ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు రూ. 86.30గా ఉండగా, ముంబైలో రూ. 92.86కు చేరుకుంది. పెట్రోలు ధరలపై విలువ ఆధారిత పన్నులను వెంటనే తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని సర్వత్రా విజ్ఞాపనలు వస్తున్నాయి. ప్రస్తుతం శ్రీగంగానగర్ లో సాధారణ పెట్రోలు ధర రూ. 98.40 ఉండగా, ప్రీమియం ధర రూ. 101.15కు చేరుకుంది. ప్రీమియం పెట్రోల్ లో కాలుష్య కారకమైన ఆక్టేన్ పరిమాణం తక్కువగా ఉంటుందన్న సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు