నివేశ్ బస్ యాత్రను ప్రారంభించిన కెనరా రోబెకో అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్

ఐవీఆర్

మంగళవారం, 16 సెప్టెంబరు 2025 (18:57 IST)
భారతదేశంలోని రెండవ పురాతన ఆస్తి నిర్వహణ సంస్థ అయిన కెనరా రోబెకో అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్, ఈరోజు నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో దాదాపు నెల రోజుల పాటు నిర్వహించనున్న పెట్టుబడిదారుల విద్యా కార్యక్రమం నివేశ్ బస్ యాత్రను ప్రారంభించింది. ఈ బస్సు కర్నూలులో తన ప్రయాణాన్ని ప్రారంభించి, అనంతపురం, తిరుపతి, నెల్లూరు, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం మీదగా ప్రయాణించి, ప్రతి నగరంలోని స్థానిక నివాసితులకు పెట్టుబడిదారులకు అవగాహన కల్పిస్తుంది.
 
నేటి ఆర్థిక రంగంలో, విజ్ఞానం అనేది అవగాహన వలె శక్తివంతమైనది. తగిన సమాచారం ఉన్న పెట్టుబడిదారుడు తమకు తాముగా మెరుగైన నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా విస్తృతస్థాయిలో ఆర్థిక పర్యావరణ వ్యవస్థను కూడా బలోపేతం చేస్తాడు. పెట్టుబడి జ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి, ఆచరణీయంగా మార్చడానికి మేము కట్టుబడి ఉన్నాము అని కెనరా రోబెకో ఏఎంసి మేనేజింగ్ డైరెక్టర్- చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రజనీష్ నరులా అన్నారు. నివేశ్ బస్ యాత్ర ఆర్థిక విద్యను సమాజాలకు నేరుగా తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాలకు చేరుకున్న మేము ఇప్పుడు దానిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు తీసుకెళ్తున్నాము. హైదరాబాద్, కర్నూలు, అనంతపురం, తిరుపతి, నెల్లూరు, గుంటూరు, విజయవాడ నుండి విశాఖపట్నం నివాసితులకు పెట్టుబడులను సరళీకృతం చేయడానికి, అపోహలను తొలగించడానికి, దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికను స్వీకరించడానికి ఇది సహాయపడుతుంది అని అన్నారు. 
 
ఆర్థిక జ్ఞానాన్ని ఆచరణాత్మకంగా అందుబాటులోకి తీసుకురావడం ద్వారా పెట్టుబడిదారులను శక్తివంతం చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము అని కెనరా రోబెకో ఏఎంసి, సేల్స్-మార్కెటింగ్ హెడ్ గౌరవ్ గోయల్ అన్నారు. ఆయనే మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిని సరళీకృతం చేయడం, కార్యాచరణ మార్గదర్శకత్వాన్ని అందించడం, సాధారణ అపోహలను తొలగించటం, పెట్టుబడిదారులు విశ్వాసాన్ని పెంపొందించుకోవడం, సంపద సృష్టికి దీర్ఘకాలిక విధానాన్ని అవలంబించడంలో సహాయపడటం మా లక్ష్యం అని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు