ఆదిత్య బిర్లా గ్రూప్కు చెందిన లోహ విభాగంలో ప్రతిష్టాత్మక సంస్థ అయిన హిందాల్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్, అమెరికాకు చెందిన ప్రముఖ స్పెషాలిటీ అల్యూమినా తయారీదారు అయిన అలూకెమ్ కంపెనీస్, ఇంక్.లో 100% ఈక్విటీ వాటాను యుఎస్ డి 125 మిలియన్లకు కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించింది. హిందాల్కో యొక్క పూర్తిగా యాజమాన్య అనుబంధ సంస్థ ఆదిత్య హోల్డింగ్స్ ఎల్ఎల్సి ద్వారా ఈ కొనుగోలు జరుగనుంది.
హిందాల్కో యొక్క స్పెషాలిటీ అల్యూమినా వ్యాపారం, దాని విలువ-ఆధారిత వ్యూహానికి కీలకమైనది, ఎలక్ట్రిక్ మొబిలిటీ, సెమీకండక్టర్లు, ప్రెసిషన్ సిరామిక్స్ వంటి అత్యాధునిక రంగాలలో కొత్తగా స్పెషాలిటీ అల్యూమినా వినియోగం పెరిగినందున, ఈ కొనుగోలు హిందాల్కో యొక్క ఆవిష్కరణలను పెంచుతుంది.
ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ శ్రీ కుమార్ మంగళం బిర్లా మాట్లాడుతూ, “విలువ-ఆధారిత, హై-టెక్ మెటీరియల్స్లో నాయకత్వ స్థానాన్ని మెరుగుపరుచుకోవాలనే మా వ్యూహంలో ఈ కొనుగోలు ఒక ముఖ్యమైన ముందడుగు. స్పెషాలిటీ అల్యూమినా విభాగంలోకి మా వ్యూహాత్మక ప్రవేశం, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న, పర్యావరణ అనుకూల పరిష్కారాల అభివృద్ధిని వేగవంతం చేయడమే కాకుండా అధిక-ప్రభావ వృద్ధి అవకాశాలను అనుసరించడానికి కొత్త మార్గాలను తెరుస్తుంది..” అని అన్నారు.
హిందాల్కో ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సతీష్ పాయ్ మాట్లాడుతూ, “ఈ కొనుగోలు తదుపరి తరం అల్యూమినా అప్లికేషన్లలో మా సామర్థ్యాలను విస్తరింప జేయడంలో కీలకంగా నిలుస్తుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లకు సేవలందించే మా సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుంది ” అని అన్నారు. హిందాల్కో ఇండస్ట్రీస్ వద్ద అల్యూమినా బిజినెస్ సిఇఒ శ్రీ సౌరభ్ ఖేడేకర్ మాట్లాడుతూ, “ఈ కొనుగోలు హిందాల్కోకు మార్కెట్ అవకాశాలు, ఉత్పత్తి పోర్ట్ఫోలియో విస్తరణతో సహా తక్షణ ప్రయోజనాలను కలిగిస్తుంది” అని అన్నారు.
అలూకెమ్ కంపెనీస్, ఇంక్. వ్యవస్థాపకుడు శ్రీ రోనాల్డ్ పి. జాప్లెటల్ మాట్లాడుతూ "హిందాల్కోతో ఈ భాగస్వామ్యం అలూకెమ్కు ఉత్తర అమెరికాలో వేగంగా అభివృద్ధి చెందడానికి తగిన సామర్థ్యం తెస్తుంది. ఉత్తర అమెరికా దాటి మార్కెట్ విస్తరణను నడిపించడంలో సహాయపడుతుంది" అని అన్నారు.