హైదరాబాద్: యుఎఈ లోని షార్జా ప్రభుత్వ షార్జా ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఫ్రీ జోన్(SAIF-సైఫ్ జోన్) సహకారంతో భారత వాణిజ్య, పరిశ్రమల సమాఖ్య(ఫిక్కీ) ఈరోజు హైదరాబాద్లో "యుఎఈ ద్వారా అంతర్జాతీయ మార్కెట్లలో మీ వ్యాపారాన్ని విస్తరించండి" శీర్షికన వ్యాపార సదస్సును నిర్వహించింది. ఈ సదస్సులో తయారీ, లాజిస్టిక్స్, ఫార్మాస్యూటికల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంజనీరింగ్ రంగాలకు చెందిన వ్యాపారవేత్తలతో సహా తెలంగాణ వ్యాప్తంగా విస్తృత శ్రేణి పరిశ్రమ రంగాల నుండి కూడా ఔత్సాహికులు పాల్గొన్నారు.
ఫిక్కీ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ కో-చైర్మన్, సుధాకర్ పివిసి ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ శ్రీ జయదేవ్ మీలా స్వాగతోపన్యాసం చేశారు. భారతదేశం-యుఎఈ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం(సెపా)కింద అంతర్జాతీయ మార్కెట్లను లక్ష్యంగా చేసుకున్న భారతీయ వ్యాపారాలకు లాంచ్ప్యాడ్గా యుఎఈ, మరీ ముఖ్యంగా షార్జా యొక్క వ్యూహాత్మక ప్రాధాన్యతను నొక్కి చెప్పారు.
సైఫ్ జోన్ డైరెక్టర్ జనరల్ శ్రీ సౌద్ అల్ మజ్రౌయి కీలకోపన్యాసం చేశారు. సైఫ్ జోన్ యొక్క ప్రత్యేక ప్రయోజనాలైన 100% విదేశీ యాజమాన్యం, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, సరళీకృత నియంత్రణ విధానాలు, సౌకర్యవంతమైన ప్రపంచ కనెక్టివిటీ వంటి వాటిని ఆయన వెల్లడించారు. భారతీయ కంపెనీలు తమ ప్రపంచ కార్యకలాపాలను విస్తరించడానికి ఇది ఒక ఆదర్శ కేంద్రంగా మారిందన్నారు. సైఫ్ జోన్ సౌకర్యాలపై ఒక కార్పొరేట్ వీడియోను ప్రదర్శించారు, తరువాత సైఫ్ జోన్ నుండి శ్రీ అనూప్ వారియర్ ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు, షార్జాలో వ్యాపారం చేయడంలో సౌలభ్యం , భారతీయ పెట్టుబడిదారులకు అందుబాటులో ఉన్న సౌకర్యాలతో కూడిన మద్దతు గురించి ఆయన వివరించారు.
భారతదేశం-యుఎఇ భాగస్వామ్యాల ప్రాముఖ్యతను, పలు రాష్ట్రాల వ్యాప్తంగా ఈ తరహా సదస్సులను నిర్వహించటంలో ఫిక్కీ యొక్క నిబద్ధతను పునరుద్ఘాటించిన ఫిక్కీ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు, ఎటర్నిఫై భాగస్వామి శ్రీ ధ్రువ్ గుప్తా ధన్యవాదాలతో సదస్సు ముగిసింది.