ఉచితంగా 5 లీటర్ల పెట్రోల్? ఎలా?

శుక్రవారం, 14 డిశెంబరు 2018 (09:09 IST)
పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. ఇటీవల లీటరు పెట్రోల్ ధర రూ.90ను దాటి సెంచరీకి చేరువైంది. ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తక్కువగా ఉన్నప్పటికీ అమెరికాతో రూపాయి మారకం విలువ గణనీయంగా పడిపోయింది. ఈ ప్రభావం పెట్రోల్ ధరలపై చూపింది. ఫలితంగా పెట్రోల్ ధరలు భారీగా పెరిగిపోయాయి.
 
అయితే, ఇపుడు భారతీయ స్టేట్ బ్యాంకు తన ఖాతాదారులకు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఉచితంగా ఐదు లీటర్ల పెట్రోల్ ఇవ్వనుంది. ఇందుకోసం ఎస్.బి.ఐ కస్టమర్లు ఓ చిన్నపని చేయాల్సివుంటుంది. 
 
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడిచే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకుల్లో కేవలం 100 రూపాయలకు పెట్రోల్ కొనడమే. ఈ పెట్రోల్‌ను "భీమ్ ఎస్.బి.ఐ పే" అనే యాప్‌ ద్వారా కొనుగోలు చేయాల్సివుంటుంది. ఇలా చేసే ఎస్.బి.ఐ ఖాతాదారులు ఉచితంగా 5 లీటర్ల పెట్రోల్ పొందొచ్చు.
 
నిజానికి ఈ ఆఫర్ నవంబరు 23వ తేదీ వరకు మాత్రమే ఉండేది. కానీ, ఈ ఆఫర్‌ను డిసెంబరు 15వ తేదీ 2018 వరకు పొడగించారు. ఈ విషయాన్ని ఎస్.బి.ఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. సో.. ఇకెందుకు ఆలస్యం రూ.5 లీటర్ల పెట్రోల్‌ను ఉచితంగా పొందేందుకు ట్రై చేయండి. 

 

Fuel up with BHIM SBI Pay at any Indian Oil Retail outlet and get up to 5 litres of petrol absolutely free! Offer extended until 15th Dec 2018. For more details, visit: https://t.co/SItjGjVIxN#SBI #IndianOil #NPCI #Offer #Deal #Fuel #Petrol #BHIMSBIPay #UPI @NPCI_NPCI pic.twitter.com/0Z5nS8bG9C

— State Bank of India (@TheOfficialSBI) December 13, 2018

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు