సుందరం ఫైనాన్స్ సంస్థ సుందరం సర్కిల్ పేరుతో ప్రత్యేక కస్టమర్ సమావేశం

ఐవీఆర్

మంగళవారం, 19 ఆగస్టు 2025 (22:29 IST)
విశాఖపట్నం: చాలా పరస్పర చర్యలు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లకు మారిన ఈ యుగంలో, సుందరం ఫైనాన్స్ విశాఖపట్టణంలో ప్రత్యేకమైన కస్టమర్ మీట్ ‘సుందరం సర్కిల్’ను నిర్వహించడం ద్వారా మానవ అనుసంధానంపై తన నిబద్ధతను మరలా రుజువు చేసింది. వేర్ లెగసీ మీట్స్ లాయల్టీ-అండ్ వెల్కమ్స్ ది నెక్స్ట్ జనరేషన్ అనే ఇతివృత్తంతో నిర్వహించిన ఈ కార్యక్రమం, దీర్ఘకాల వాణిజ్య వాహన వినియోగదారులు, వారి తరువాతి తరాన్ని ఒక వేదికపైకి తీసుకువచ్చింది. అనుసంధానం, ప్రతిబింబం, భవిష్యత్‌ దిశగా సంభాషణలతో నిండిన ఈ సాయంత్రం సమావేశంలో సుమారు 50 మందికి పైగా కస్టమర్లు పాల్గొన్నారు.

ప్రపంచం వర్చువల్ సౌలభ్యం వైపు అడుగులు వేస్తున్నప్పటికీ, వ్యక్తిగత అనుబంధాల విలువను సుందరం ఫైనాన్స్ ఎల్లప్పుడూ ముందుంచుతుందని కంపెనీ నాయకత్వం స్పష్టం చేసింది. సంబంధాలు తెరమీద ఏర్పడవు. అవి కరచాలనం, చిరునవ్వు, కలిసి గడిపిన సమయంతోనే బలపడతాయి అని ఒక సీనియర్ నాయకుడు తెలిపారు.
 
ఈ నమ్మకం, మా వ్యవస్థాపకుడు శ్రీ T.S. సంతానం గారి మార్గదర్శక మంత్రాన్ని ప్రతిధ్వనిస్తుంది. కాంటాక్ట్. కాంటాక్ట్. కాంటాక్ట్. ఇది శాశ్వత కస్టమర్ సంబంధాల మూలస్తంభంగా నిలిచింది. కస్టమర్-సెంట్రిసిటీ ఒక ధోరణిగా మారకముందే, 1924లోనే మా వ్యవస్థాపకుడి తండ్రి శ్రీ సుందరం అయ్యంగార్ గారు బస్సు రవాణా రంగంలో ఇటువంటి అనేక కార్యక్రమాలకు పునాదులు వేసి మార్గదర్శకత్వం వహించారు. సుందరం ఫైనాన్స్, సుందరం హోమ్, సుందరం మ్యూచువల్, రాయల్ సుందరం, సుందరం బిజినెస్ సర్వీసెస్, సుందరం ఆల్టర్నేట్స్ వంటి గ్రూప్ కంపెనీల ద్వారా సమగ్ర పరిష్కారాలను అందించడం ద్వారా, ఈ మొత్తం ఈవెంట్ సుందరం ఫైనాన్స్ యొక్క 360 డిగ్రీల నిబద్ధతను ప్రతిబింబించింది.
 
ఈ 360 డిగ్రీల విధానం కేవలం లావాదేవీలకు మాత్రమే పరిమితం కాకుండా విస్తరిస్తుంది. సుందరం ఫైనాన్స్ అనేది ప్రతిరోజూ అనుసంధానాలను నిర్మించే వ్యాపారం, ఇక్కడ భాగస్వామ్యాలు జీవనోపాధికి శక్తినిస్తాయి, వ్యాపారాలకు బలాన్ని ఇస్తాయి, కలలు సాకారం కావడానికి దోహదపడతాయి. దీర్ఘకాలిక పర్యావరణ ప్రభావంపై దృష్టి సారించే గ్రీన్ టాస్క్ ఫోర్స్‌తో పాటు, ఆరోగ్యం, విద్య, సంస్కృతి, సుస్థిరత రంగాల్లో సిఎస్ఆర్ కార్యక్రమాల ద్వారా గ్రూప్ తన కర్తవ్యాన్ని పరిపూర్ణం చేస్తోంది.
 
కస్టమర్ మీట్‌లో సీనియర్ నాయకుల ప్రసంగాలు, తరువాతి తరం వ్యవస్థాపకులు- వ్యాపార యజమానులతో స్ఫూర్తిదాయక సంభాషణలు, అలాగే అభివృద్ధి చెందుతున్న అవసరాలను తీర్చడంలో సుందరం ఫైనాన్స్- గ్రూప్ పరిష్కారాల పాత్రపై చర్చలు జరిగాయి. కంపెనీతో తమ శాశ్వత అనుబంధాన్ని గౌరవిస్తూ, నాయకులు దీర్ఘకాల కస్టమర్లను ప్రత్యేక గుర్తింపు జ్ఞాపికలతో సత్కరించారు. ఈ సందర్భంలో, అనుభవజ్ఞులైన వినియోగదారులు తమ ప్రయాణాలను పంచుకోగా, మొదటిసారి హాజరైనవారు సంస్థ యొక్క సంబంధ-ఆధారిత విధానాన్ని ప్రత్యక్షంగా అనుభవించారు. ఇది నేటి వేగవంతమైన, లావాదేవీ-కేంద్రీకృత మార్కెట్లో సుందరం ఫైనాన్స్‌ను ప్రత్యేకంగా నిలబెట్టే మూలస్థంభం.
 
సాయంత్రం ముగింపులో, సుందరం ఫైనాన్స్ తన నిబద్ధతను మరోసారి స్పష్టంగా వ్యక్తం చేసింది. అది కేవలం తదుపరి లావాదేవీకి మాత్రమే కాక, ప్రతి కస్టమర్ ప్రయాణంలోని ప్రతి తదుపరి క్షణంలోనూ స్థిరమైన భాగస్వామిగా నిలవడమే లక్ష్యమని పునరుద్ఘాటించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు