ది స్లీప్ కంపెనీ బహుమతుల ప్రకటన; ఉచితంగా రూ. 1 కోటి విలువైన పరుపులు

ఐవీఆర్

మంగళవారం, 27 ఆగస్టు 2024 (22:41 IST)
హైదరాబాదీలూ, 31 ఆగస్ట్ 2024న ది స్లీప్ కంపెనీ (TSC) స్టోర్‌లలో మీ కలల పరుపును సొంతం చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. దాదాపు రూ. 25 లక్షల విలువైన 100 ఉచిత పరుపుల బహుమతి ఆ రోజు ఉదయం 11 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మొదట వచ్చిన వారికి , మొదట ప్రాతిపదికన అందించటం జరుగుతుంది. ఒక దశాబ్దం పాటు సుఖ నిద్ర కోసం మీరు చేయాల్సిందల్లా హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్, కోకాపేట్, శరత్ సిటీ క్యాపిటల్ మాల్, కార్ఖానాలలో ఉన్న TSC స్టోర్‌కు చేరుకోవడం. హైదరాబాద్, ముంబై, చెన్నై మరియు ఢిల్లీ-ఎన్‌సిఆర్‌తో సహా ప్రధాన మెట్రోలలో కంపెనీ సుమారు రూ. 1 కోటి విలువైన ఉచిత పరుపులను అందజేస్తున్న కార్యక్రమంలో భాగంగా ఇది జరుగనుంది. 
 
ఇది ఇంత భారీ బహుమతిని ప్రకటించిన భారతదేశపు మొట్టమొదటి మ్యాట్రెస్ బ్రాండ్‌గా TSC నిలిచింది. ఇటీవల భారతదేశంలో తన 100వ కోకో  స్టోర్‌ను TSC ప్రారంభించింది, ఈ ఆఫర్‌తో ఈ మైలురాయిని వేడుకగా జరుపుకోనుంది. స్లీప్ కంపెనీ కోఫౌండర్, ప్రియాంక సలోట్ మాట్లాడుతూ, “ప్రజలు బాగా నిద్రపోవడానికి సహాయ పడాలనే మా మిషన్‌లో భాగంగా భారతదేశం అంతటా హైదరాబాద్‌తో పాటు, ముంబై, చెన్నై, ఢిల్లీలో 100 చొప్పున ఉచిత పరుపులను అందించడం ద్వారా 100వ కోకో స్టోర్ మైలురాయిని జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం ద్వారా, మా పేటెంట్ పొందిన స్మార్ట్‌గ్రిడ్ మ్యాట్రెస్‌ని ఇంటికి తీసుకెళ్లే అవకాశాన్ని ప్రజలకు అందించాలనుకుంటున్నాము" అని అన్నారు. 
 
ది స్లీప్ కంపెనీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ రిపాల్ చోప్డా మాట్లాడుతూ, “ఈ బహుమతి హైదరాబాదీలు మా పట్ల చూపుతున్న నమ్మకం, విశ్వాసంకు మాదైన రీతిలో కృతజ్ఞతలు తెలిపే మార్గం. వినూత్నమైన, పేటెంట్ పొందిన స్మార్ట్ గ్రిడ్ సాంకేతికతతో, మా పరుపులు వ్యక్తులకు లోతైన మరియు కలవరపడని నిద్రను అందిస్తాయి" అని అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు