తెలుగు రాష్ట్రాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

శుక్రవారం, 6 ఆగస్టు 2021 (11:29 IST)
గత కొంతకాలంగా బంగారం, వెండి ధరల్లో హెచ్చతగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లోని బంగారం, వెండి ధరలు శుక్రవారం కాస్త తగ్గాయి. వెండి ధర రూ.69 వేల దిగువకు చేరింది. 
 
ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్​, వైజాగ్​, విజయవాడలో 10 గ్రాముల బంగారం ధర (24 క్యారెట్)​ రూ.49,205 వద్ద ఉంది. ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.68,867 వద్ద కొనసాగుతోంది. స్పాట్​ గోల్డ్ ధర ఔన్సు 1801.65 డాలర్ల వద్ద ఉంది. వెండి ధర ఔన్సు 25.16 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు