కావలసిన పదార్థాలు : ముళ్లులేని చేపముక్కలు... అర కేజీ వెన్న... 50 గ్రా. పెరుగు... ఒక కప్పు కొత్తిమీర తురుము... ఒక టీ. అల్లంముద్ద... ఒక టీ. పచ్చిమిర్చి ముద్ద... అర టీ. మిరియాలపొడి... అర టీ. గరంమసాలాపొడి... అర టీ. ఉప్పు... తగినంత
తయారీ విధానం : శుభ్రం చేసిన చేప ముక్కలకు పెరుగు, వెన్న, కొత్తిమీర, పచ్చిమిర్చి ముద్ద, మిరియాలపొడి, ఉప్పు పట్టించి అరగంటసేపు అలాగే ఉంచాలి. కబాబ్ చువ్వలకు ఈ చేప ముక్కలను గుచ్చి ట్రేలో ఉంచి మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టి సాధారణ ఉష్ణోగ్రత వద్ద 8 నిమిషాలపాటు ఉడికించి తీసేయాలి. అంతే వేడి వేడి బటర్ ఫిష్ కబాబ్స్ సిద్ధమైనట్లే...! వీటిని కూరగాయ ముక్కలతో అలంకరించి ఏదేని గ్రీన్ చట్నీతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి.