ప్రయాణికురాలి చెంప ఛెళ్లుమనిపించిన ర్యాపిడో బైక్ రైడర్

ఠాగూర్

సోమవారం, 16 జూన్ 2025 (17:55 IST)
ఇటీవలికాలంలో బెంగుళూరు నగరంలో కాల్ ట్యాక్సీ డ్రైవర్లు, బైక్ రైడర్లు ప్రయాణికులపై దురుసుగా ప్రవర్తిస్తూ వారిపై చేయి చేసుకుంటున్న సంఘటనలు జరుగుతున్నాయి. తాజాగా ఓ మహిళా ప్రయాణికురాలిపై ర్యాపిడో బైక్ ట్యాక్సీ రైడర్ ఒకరు మహిళా ప్రయాణికురాలి చెంప ఛెళ్లుమనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. జయనగర్ ప్రాంతంలో ఈ అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. దీంతో బెంగుళూరు వంటి నగరాల్లో మహిళల భద్రతపై ఆందోళన కలిగిస్తోంది. 
 
ఒక నగల దుకాణంలో పని చేసే యువతి రాపిడో బైక్ ట్యాక్సీని బుక్ చేసుకుంది. అయితే, రైడర్ నిర్లక్ష్యంగా వేగంగా వాహనం నడుపుతుండటంతో ఆమె భయాందోళనకుగురైంది. దీంతో ప్రయాణాన్ని మధ్యలోనే ఆపేసి బైక్ దిగిపోయింది. ఈ క్రమంలో రైడర్ తీరును ఆమె ప్రశ్నించడంతో వారిద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. 
 
సదరు యువతి ఇంగ్లీషులో మాట్లాడుతుండగా రైడర్ కేవలం కన్నడలోనే సమాధానం చెప్పడంతో ఒకరి మాటలు ఒకరికి అర్థంకాలేదు. ప్రయాణ చార్జీ చెల్లించేందుకు హెల్మెట్ తిరిగి ఇచ్చేందుకు మహిళ నిరాకరించింది. ఈ క్రమంలో ఆవేశానికి లోనైన రైడర్.. ఆమె చెంప ఛెళ్లుమనిపించాడు. చెంపపై లాగి కొట్టడంతో ఆమె కిందపడిపోయింది. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 

Rapido Driver Slaps Woman in Bengaluru After Argument Over 'Rash Driving'#Rapido #Trending #Viral #ViralVideo #RashDriving #Bengaluru #Kolkata #viralvideo pic.twitter.com/fMAe6YIX6s

— Lokmat Times Nagpur (@LokmatTimes_ngp) June 16, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు