కరోనా న్యూస్ : ఎయిర్ ఇండియా పైలట్లకు పాజిటివ్...

ఆదివారం, 10 మే 2020 (13:11 IST)
దేశంలో కరోనా వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తూనే వుంది. గత 24 గంటల్లో కొత్తగా 3277 కరోనా కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 62939కి చేరాయి. అలాగే, గత 24 గంటల్లో 127 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ వైరస్ బారినపడి చనిపోయినవారి సంఖ్య 2109కి చేరింది. ఇప్పటివరకు కరోనా నుంచి 19,358  మంది కోలుకున్నారు. ఆసుపత్రుల్లో 41,472 మంది చికిత్స పొందుతున్నారు. 
 
ఈ పరిస్థితుల్లో ఎయిప్ ఇండియాకు చెందిన ఐదుగురు పైలెట్లకు కరోనా పాజిటివ్ అని తేలినట్టు వార్తలు వస్తున్నాయి. టేకాఫ్ అయ్యేందుకు 72 గంటల ముందు పలువురు పైలెట్లకు జరిపిన పరీక్షల్లో ఈ విషయం వెలుగుచూసింది. 
 
కాగా, చైనాలోని వుహాన్‌లో కరోనా వైరస్ వెలుగు చూసిన తర్వాత ఎయిర్ ఇండియా అనేక ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేసింది. ముఖ్యంగా, ప్రపంచ దేశాలకు అవసరమైన హైడ్రాక్సీక్లోరోక్వీన్ మాత్రలను ఎయిర్ ఇండియా సరఫరా చేసింది. ఇందుకోసం ఎయిర్ ఇండియా పలు దేశాలకు ప్రత్యేక విమాన సర్వీసులను నడిపింది. 
 
ప్రపంచం మొత్తం లాక్డౌన్ ఉంటే ఎయిర్ ఇండియా మాత్రం పలు మిషన్లను విజయవంతంగా పూర్తిచేసే పనిలో నిమగ్నమైంది. ఈ క్రమంలోనే పలువురు పైలెట్లు కరోనా బాధిత దేశాలకు వెళ్లగా, ఆ సమయంలో ఈ వైరస్ సోకివుండొచ్చన్న అనుమానిస్తున్నారు. అయితే, కరోనా వైరస్ సోకిన ఐదుగురు పైలెట్ల వివరాలు తెలియాల్సివుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు