ఏపీలో హోమ్ క్వారంటైన్ బాధితులకు కరోనా కిట్లు: జగన్ సర్కార్ ముందడుగు

శనివారం, 11 జులై 2020 (18:28 IST)
కరోనాపై పోరులో జగన్ సర్కారు దేశంలోనే ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంటోంది. ఇప్పటికే కరోనావైరస్ టెస్టులో ఎంతో వేగాన్ని సాధించి, కరోనా నివారణ కోసం ముందంజలో ఉంది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు మరో కొత్త అడుగు వేసింది. 
 
దేశంలోనే ఎక్కడా లేని విధంగా హోమ్ క్వారంటైన్లో ఉన్న బాధితుల కోసం ప్రత్యేకంగా ఓ కిట్‌ను రూపొందించింది. ఈ కిట్‌ను పూర్తి ఉచితంగా ఇస్తోంది ప్రభుత్వం. దీంతో కరోనా నివారణలో జగన్ సర్కార్ ముందడుగు వేసినట్టయ్యింది. ఈ కరోనా కిట్లో మాస్కులు, శానిటైజర్లు, విటమిన్ ట్యాబ్లెట్లు, ఆక్సిజన్ లెవెల్‌ను చూసుకునేందుకు పల్స్ ఆక్సీమీటర్ ఉంటాయి. దీనివలన ఇంట్లోనే క్వారంటైన్లో ఉన్న బాధితులు కోలుకోవడానికి మానసిక ధైర్యం వస్తుందని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు