దేశంలో త్వరలోనే కరోనా టీకాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ టీకాల పంపిణీ నెల 25వ తేదీ నుంచి చేపట్టే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తున్నాయి. అయితే, ఈ వ్యాక్సినేషన్ ఎలా చేపట్టాలన్న అంశంపై కేంద్రం కసరత్తు చేస్తోంది.
వినియోగదారులకు టీకాను వేగంగా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, ఇందుకోసం ఓ నిపుణుల కమిటీ ఏర్పాటు, టీకా కార్యక్రమానికి సంబంధించి అన్ని అంశాలపై ఎస్ఓపీ దిశానిర్దేశం చేస్తుందని ఆరోగ్యశాఖ పేర్కొంది. టీకా కార్యక్రమం ఎన్నికల ప్రక్రియను పోలి వుంటుందని తెలిపింది.
తొలి విడతలో వంద మందికి మాత్రమే వ్యాక్సినేషన్ చేస్తారని, మౌలిక వసతులు మెరుగ్గా ఉంటే ఈ సంఖ్య 200కు కూడా పెరుగుతుందని పేర్కొంది. అయితే, వ్యాక్సినేషన్ కార్యక్రమం ఏయే రోజుల్లో చేపట్టాలన్నదానిపై ఆయా రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవచ్చని వివరించింది.