దేశంలో కరోనా విజృంభణ.. 24 గంటల్లో 13,216 మందికి పాజిటివ్

శనివారం, 18 జూన్ 2022 (12:04 IST)
దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కేంద్ర వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. టెస్టుల సంఖ్య పెంచాలని రాష్ట్రాలకు సూచించింది. ఇప్పటివరకు 1,96,00,42,768 కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని చెప్పింది.
 
గడిచిన 24 గంటల్లో కొత్తగా 13,216మంది కరోనా బారినపడ్డారు. వైరస్ కారణంగా మరో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 68,108కు చేరింది. ప్రస్తుతం డైలీ పాజిటివిటీ రేటు 2.73శాతానికి పెరిగింది. 
 
దేశంలో నమోదైన కొత్త కేసుల్లో ఎక్కువ శాతం మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళ రాష్ట్రాలలోనే ఉన్నాయి. కేరళలో 3వేల 253 కేసులు నమోదు కాగా.. ఢిల్లీలో 1797 కేసులు, ఒక్క ముంబై మహానగరంలోనే 2 వేల 255 కేసులు నమోదయ్యాయి. 
 
గడచిన 24 గంటల్లో కరోనా సోకిన వారిలో 23 మంది కోలుకోలేక చనిపోగా... ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా మొత్తం మృతుల సంఖ్య 5 లక్షల 24వేల 840కు చేరింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు