తెలంగాణలో కరోనా కేసులు.. 24 గంటల్లో 643 పాజిటివ్ కేసులు

గురువారం, 10 డిశెంబరు 2020 (11:34 IST)
తెలంగాణలో కరోనా కేసులు పెచ్చరిల్లిపోతున్నాయి. బుధవారం రాత్రి వరకు 53,396 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 643 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,75,904కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. బుధవారం కరోనాతో ఇద్దరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,482కి చేరింది.
 
కరోనా బారి నుంచి నిన్న 805 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,66,925కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 7,497 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 5,434 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు తెలంగాణలో నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 59,73,031కి చేరింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు