దేశంలో 147 రోజుల కనిష్ట స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు

మంగళవారం, 10 ఆగస్టు 2021 (10:56 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గాయి. ఈ తగ్గుదల ఎంతగా ఉందంటే 147 రోజుల క‌నిష్ఠ‌స్థాయిలో కొత్త కేసులు న‌మోద‌య్యాయి. భార‌త్‌లో గత 24 గంటల్లో 28,204 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,19,98,158కు చేరింది.
 
ఇక మరణాల విషయానికొస్తే గడిచిన 24 గంటల్లో 373 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,28,682కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,11,80,968 మంది కోలుకున్నారు.
 
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 3,88,508 మందికి ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 51,45,00,268 వ్యాక్సిన్ డోసులు వేసినట్టు అధికారులు ప్ర‌క‌టించారు. రిక‌వ‌రీ రేటు 97.45 శాతంగా ఉంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు