కరోనా చికిత్సలో రెమ్‌డెసివిర్ ఔషధం.. భేష్‌గా పనిచేస్తుందట!

శుక్రవారం, 1 మే 2020 (10:46 IST)
కరోనా చికిత్సలో రెమ్‌డెసివిర్ ఔషధం ప్రభావం అద్భుతంగా పనిచేస్తుందని తాజా పరిశోధనలో తేలింది. ప్రస్తుతం ఇండో-అమెరికన్ వైద్యుడి ఆధ్వర్యంలో మూడో దశ క్లినికల్ ట్రయల్ జరుగుతోంది. వైరస్ నివారణ సామర్థ్యం కలిగిన జౌషధాల్లో రెమ్‌డెసివిర్ ఒకటి. కరోనా ప్రపంచ దేశాలను వణికిస్తున్న తరుణంలో ఈ ఔషధంపై పరిశోధనలు, ప్రయోగాలు జరుగుతున్నాయి. 
 
అమెరికా ఫార్మా కంపెనీ ఈ ఔషధాన్ని కరోనా రోగులపై పరీక్షించగా సత్ఫలితాలు కనిపించాయి. ఇండో-అమెరికన్ ఫిజీషియన్‌తో సహా పరిశోధకుల బృందం మూడో దశ ట్రయల్స్ నిర్వహించగా సత్ఫలితాలు వచ్చాయని ఫార్మా కంపెనీ వెల్లడించింది. 
 
కాలిఫోర్నియా కేంద్రం గల ఫార్మా కంపెనీ గిలియడ్ సైన్సెస్ ఈ ఫలితాల గురించి వివరిస్తూ కరోనా రోగుల్లో 50 శాతం మందిని రెమ్‌డెసివిర్ ఐదు రోజుల డోస్‌లతో చికిత్స చేయగా చాలా పురోగతి కనిపించిందని వారిలో సగానికి సగం మందిని ఆస్పత్రి నుంచి రెండు వారాల్లో డిశ్చార్జి చేయడమైందని వెల్లడించింది. 
 
రెమ్‌డెసివిర్ ప్రత్యేకత ఏంటంటే ఇది వైరస్‌పై నేరుగా దాడి చేస్తుంది. గతంలో ఎబోలా వైరస్ నివారణకు దీన్ని నివారించారు. వైరస్ ఆర్‌ఎన్‌ఎ, డిఎన్‌ఎలోని మూలకాలను పోలి ఉండే ఈ ఔషధం వైరస్ పునరుత్పత్తికి ఆటంకం కలిగిస్తుంది. ఇతర ఔషధాలు మనిషి లోని రోగ నిరోధక శక్తిలో మార్పులు తీసుకొచ్చి వైరన్‌ను అడ్డుకునేలా చేస్తే ఈ ఔషధం మాత్రం వైరస్‌పై నేరుగా దాడి చేస్తుంది. 
 
ఫిబ్రవరి 21న ఈ ఔషధంపై అధ్యయనం ప్రారంభమైంది. అమెరికా, ఐరోపా, ఆసియా లోని 68 ప్రాంతాల్లో వెయ్యి మందిపై ఈ ఔషధ ప్రభావాన్ని పరీక్షించారు. రెమ్‌డెసివిర్ ఔషధం వల్ల క్షేమం కలుగుతుందని, సమర్ధంగా ఇది పనిచేస్తుందని నిరూపణ అయితే అదనపు డేటా అవసరమౌతుందని పరిశోధకులు చెప్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు