మ్యాచ్‌లు నిర్వహించలేని ఐసీసీ ధోనీ గ్లోవ్స్‌పై రచ్చ చేసింది : బిగ్ బి

శుక్రవారం, 21 జూన్ 2019 (17:10 IST)
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)పై బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ చురక అంటించారు. వరల్డ్ కప్ మ్యాచ్‌ల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండమేకాదు... ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లు వర్షార్పణమైపోయాయి. ముఖ్యంగా, న్యూజిలాండ్ - భారత్ మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా తుడిసిపెట్టుకునిపోయింది. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకులోనయ్యారు. అలాగే, ఐసీసీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఐసీసీపై మండిపడ్డారు. "ఏ కాలంలో మ్యాచ్‌లు నిర్వహించాలో తెలియని ఐసీసీకి.. ధోని గ్లోవ్స్‌పై రాద్దాంతం చేయడం మాత్రం తెలుసు. సిగ్గుపడాలి" అంటూ #ShameOnICC హ్యాష్‌ట్యాగ్‌తో ఐసీసీ తీరుపై మండిపడ్డారు. 
 
"వరల్డ్‌కప్‌ వేదికను భారత్‌కు మార్చండి. మాకు వర్షాల అవసరం ఎంతగానో ఉంది" అంటూ చమత్కరించారు. నీటి ఎద్దడితో ఇబ్బందులు పడుతున్న భారత ప్రజలకు.. వరల్డ్‌కప్‌ - వర్షం సెంటిమెంట్‌ కారణంగా కాస్తైనా ఉపశమనం లభిస్తుంది" అనే ఉద్దేశంతో తనదైన శైలిలో ట్వీట్‌ చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు