ఐపీఎల్ 2025 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్- రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన హోరాహోరీ పోరులో, రాజస్థాన్ జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని యువ క్రికెటర్లతో సంభాషించడానికి సమయం తీసుకున్నాడు. వారికి అనేక విలువైన సలహాలు ఇచ్చాడు.
యువ ఆటగాళ్లను ఉద్దేశించి మహేంద్ర సింగ్ ధోని మాట్లాడుతూ, "మీపై అంచనాలు పెరిగినప్పుడు ఒత్తిడికి లొంగకండి. సీనియర్ ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది నుండి నేర్చుకోండి. యువ ఆటగాళ్ళు 200 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో స్కోర్ చేయడానికి ప్రయత్నించినప్పుడు, బ్యాటింగ్లో స్థిరత్వాన్ని కొనసాగించడం కష్టమవుతుంది. అయితే, మ్యాచ్లో ఏ దశలోనైనా వారికి సిక్సర్లు కొట్టే సామర్థ్యం ఉంది. అంచనాల భారం లేకుండా తమ సహజ ఆటతీరును ప్రదర్శించమని" ధోనీ యువకులను ప్రోత్సహించాడు.
ఈ మ్యాచ్లో, ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ తమ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. రాజస్థాన్ రాయల్స్ కేవలం 17.1 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.