సచిన్‌ను తక్కువ చేసిన ఐసీసీ.. ఎందుకని?

బుధవారం, 28 ఆగస్టు 2019 (16:26 IST)
అవును. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ను ఐసీసీ తక్కువ చేసింది. బెన్ స్టోక్స్‌ను సచిన్ టెండూల్కర్‌తో పోలుస్తూ ఐసీసీ చేసిన ట్వీట్ సచిన్ అభిమానులకు చిర్రెత్తుకొచ్చింది. లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో బెన్ స్టోక్స్ 84 పరుగులతో అజేయంగా నిలిచి ఇంగ్లాండ్ తొలిసారి వరల్డ్‌కప్‌ను కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. 
 
ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనకు గాను బెన్ స్టోక్స్ అనంతరం నిర్వహించిన అవార్డుల కార్యక్రమంలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ చేతుల మీదగా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోని ఐసీసీ తన ట్విట్టర్‌లో పోస్టు చేస్తూ "ది గ్రేటెస్ట్ క్రికెటర్ ఆఫ్ ఆల్‌టైమ్‌తో సచిన్ టెండూల్కర్" అంటూ కామెంట్ పెట్టింది.
 
అప్పట్లో ఈ ట్వీట్‌పై సచిన్ అభిమానులు మండిపడ్డారు. తాజాగా లీడ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో సెంచరీ సాధించి బెన్ స్టోక్స్ ఇంగ్లాండ్‌ను గెలిపించడంతో సచిన్ టెండూల్కర్‌తో కలిసి దిగిన వరల్డ్‌కప్ ఫోటోను రీట్వీట్ చేస్తూ "ముందే చెప్పాగా?" అంటూ బుధవారం మరో ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సచిన్ అభిమానులకు కోపాన్ని తెప్పిస్తుంది. సచిన్‌తో బెన్ స్టోక్స్‌ను పోల్చడమా అంటూ ఆతని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు