క్రికెట్ ఆడితే కాల్చి చంపేస్తామన్నారు.. అన్నయ్యలపై సోదరి ఫిర్యాదు

శుక్రవారం, 27 అక్టోబరు 2017 (10:04 IST)
క్రికెట్ ఆడితే కాల్చేస్తామని బెదిరించిన అన్నయ్యలపై యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు సోదరుల నుంచి ప్రాణహాని వుందని ఆవేదన వ్యక్తం చేసింది. వివరాల్లోకి వెళితే.. హర్యానాలోని సోనెపట్ జిల్లా దేవ్రు గ్రామానికి చెందిన ఓ యువతి బీఐ సెకండియర్ చేస్తోంది. క్రికెట్‌ అంటే ఆ యువతికి ప్రాణం. కళాశాలలో క్రికెట్ బాగా ఆడేది. కానీ క్రికెట్ ఆడుతున్న విషయాన్ని తెలుసుకున్న సదరు యువతి సోదరులు ఆమెపై కోపంతో కాలేజీ మాన్పించారు.
 
కాలేజీ మాన్పించడం ఆమెకు ఇష్టం లేదు. చదువుకుంటానని, క్రికెట్ ఆడతానని సోదరులకు చెప్తే వాళ్లు ఆమెపై చేజేసుకున్నారు. అంతేగాకుండా క్రికెట్ ఆడితే  ప్రాణంగా భావించే బాలిక కళాశాలలో క్రికెట్ ఆడేది. విషయం తెలిసిన ఆమె ఇద్దరు సోదరులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమెను కాలేజీ మాన్పించారు. ఇంకా క్రికెట్ ఆడితే కాల్చి చంపేస్తామంటూ బెదిరించినట్లు బాధిత యువతి పోలీసులకు చేసిన ఫిర్యాదులో తెలిపింది. 
 
క్రికెట్‌ ఆడాలన్నది తన సొంత నిర్ణయమేనని, ఈ విషయంలో టీచర్లు, కాలేజ్ మెంటార్ల ఒత్తిడి లేదని యువతి పేర్కొంది. తన సోదరులకు దూరంగా బతకాలనుకుంటున్నానని, తన ఆశయాలకు అనుగుణంగా జీవితాన్ని మలచుకోవాలనుకుంటున్నానని యువతి పోలీసులకు తెలిపింది. సోదరుల నుంచి తనకు ప్రాణహాని వుందని చెప్పుకొచ్చింది. యువతి ఫిర్యాదుతో పోలీసులు ఆమె సోదరులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు