టీమిండియాను ఓడిస్తే.. ఆ దేశపు వ్యక్తిని పెళ్లాడుతా: పాక్ నటి

గురువారం, 3 నవంబరు 2022 (21:02 IST)
Zimbabwean guy
ట్వంటీ-20 ప్రపంచ కప్ 2022లో భాగంగా నవంబర్‌ 6న ఇరు జట్లు తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియాను చిత్తుగా జింబాబ్వే ఓడిస్తే ఆ దేశపు వ్యక్తిని పెళ్లాడతానని పాకిస్తాన్‌ నటి సెహర్‌ షిన్వారీ వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఆమె ట్వీట్‌ చేసింది.
 
'తదుపరి మ్యాచ్‌లో జింబాబ్వే అద్భుతంగా భారత్‌ను ఓడించినట్లయితే.. నేను ఆ దేశానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటాను' అని తెలిపింది.
 
ఈ పాక్ నటి గతంలో కూడా టీమిండియాపై అక్కసు వెళ్లగక్కుతూ వివాదాస్పద ట్వీట్లతో వార్తల్లో నిలిచింది. బంగ్లాదేశ్‌- భారత్‌ మ్యాచ్‌ సందర్భంగా కూడా రోహిత్‌ సేన ఓడిపోవాలని పదే పదే కోరుకుంటూ ట్వీట్‌ చేసింది.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు