ఈ క్రమంలో ఐసీసీ ర్యాంకింగ్స్లో భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ చరిత్ర సృష్టించాడు. హెడింగ్లీ టెస్ట్లో తన జంట సెంచరీల తర్వాత రిషబ్ పంత్ తాజా ఐసీసీ టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో ఏడవ స్థానానికి ఎగబాకాడు. ఈ అద్భుతమైన వికెట్ కీపర్-బ్యాటర్ 134, 118 స్కోర్లను నమోదు చేశాడు. అలాగే, 2001లో జింబాబ్వేకు చెందిన ఆండీ ఫ్లవర్ ఘనతకు తర్వాత అతను రెండవ వికెట్ కీపర్ అయ్యాడు.
ఫలితంగా 27 ఏళ్ల పంత్ 800 రేటింగ్ పాయింట్లను సాధించిన తొలి భారత వికెట్ కీపర్ అయ్యాడు. గతంలో భారత వికెట్ కీపర్ సాధించిన అత్యుత్తమ రేటింగ్ ఎంఎస్ ధోని పేరిట వుంది. అతను 2008లో 662 రేటింగ్ పాయింట్లను సాధించాడు. జాతీయ జట్టు తరపున టెస్ట్ క్రికెట్లో పంత్ స్థిరమైన ప్రదర్శనలు ఇస్తున్నాడు. హెడింగ్లీ టెస్ట్లో కూడా తన ఫామ్ను కొనసాగించాడు.