న్యూజిలాండ్ భారత్ జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ను రద్దు చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదని జస్టీస్ లోథా కమిటీ స్పష్టం చేసింది. ఇటీవల లోథా కమిటీ సూచించిన సిఫార్సులను బీసీసీఐ పాటించడంలేదంటూ బోర్డుపై సుప్రీంకోర్టు ఇటీవలే ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు ఆదేశాలు జారీ చేసిన విషయం తెల్సిందే. దీంతో బీసీసీఐ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూండటంతో భారత్-న్యూజిలాండ్ మధ్య మ్యాచులు రద్దయ్యే అవకాశం ఉందని పలువురు భావించారు.