పంజాబ్‌పై చెన్నై కింగ్స్ గెలుపు.. 38 పరుగులతో అదుర్స్.. ధోనీ రికార్డ్

సెల్వి

ఆదివారం, 5 మే 2024 (21:11 IST)
MS Dhoni
ఐపీఎల్ లీగ్ పోటీలో పంజాబ్ కింగ్స్‌- చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో చెన్నై జట్టు సూపర్ విజయం సాధించింది. టాస్ గెలిచిన పంజాబ్ జట్టు బౌలింగ్‌కు దిగింది. ఆరంభం నుంచి చెన్నై పరుగులను నియంత్రించింది. దీంతో 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 167 పరుగులు మాత్రమే చేయగలిగింది. 
 
ఈ నేపథ్యంలో స్వల్ప లక్ష్యాన్ని చేధించే క్రమంలో బరిలోకి దిగిన పంజాబ్‌కు చెన్నై చుక్కలు చూపించింది. నిర్ణీత 20 ఓవర్లలో 139 పరుగులకే పరిమితం అయ్యింది. దీంతో 38 పరుగుల తేడాతో చెన్నై గెలుపును నమోదు చేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున 3 వికెట్లు, దేశ్ పాండే రెండు వికెట్లు, ఇంపాక్ట్ ప్లేయర్‌గా దిగిన హిరనిక్య సింహరిత్ సింగ్ 2 వికెట్లు సాధించాడు. ఈ గెలుపు ద్వారా సీఎస్కే గణాంకాల పట్టికలో 3వ స్థానానికి చేరుకుంది.  
 
ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా (46; 26 బంతుల్లో, 3x4, 2x6) టాప్ స్కోరర్. రుతురాజ్ గైక్వాడ్ (32; 21 బంతుల్లో, 4x4, 1x6), డారిల్ మిచెల్ (30; 19 బంతుల్లో, 2x4, 1x6) కీలక పరుగులు సాధించారు. శివమ్ దూబె, ఎంఎస్ ధోనీ ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్‌కు చేరారు. పంజాబ్ బౌలర్లలో రాహుల్ చాహర్ (3/23), హర్షల్ పటేల్ (3/24) చెరో మూడు వికెట్లతో సత్తాచాటారు.
 
అనంతరం ఛేదనలో 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 139 పరుగులే చేసింది. అయితే ఈ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ అరుదైన రికార్డు సాధించాడు. జితేశ్ శర్మ ఇచ్చిన క్యాచ్ అందుకున్న ధోనీ ఘనత అందుకున్నాడు.
 
ఐపీఎల్ చరిత్రలో 150 క్యాచ్‌లను అందుకున్న తొలి వికెట్ కీపర్‌గా చరిత్రకెక్కాడు. లీగ్‌లో ధోనీ 150 క్యాచ్‌లతో పాటు 42 స్టంపింగ్స్ చేశాడు. ఐపీఎల్‌లో అత్యధిక క్యాచ్‌లు, స్టంపింగ్స్ చేసిన వికెట్ కీపర్ల జాబితాలో ధోనీ తర్వాతి స్థానంలో దినేశ్ కార్తీక్ ఉన్నాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు