ఐసీసీ సిరీస్‌లో ప్రతిసారీ గెలవాలంటే ఎలా..? గంగూలీ

బుధవారం, 23 ఆగస్టు 2023 (09:35 IST)
ప్రపంచ క్రికెట్‌లో ఆధిపత్య జట్లలో భారత క్రికెట్ ఒకటి. భారత క్రికెట్ బోర్డు ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు అదే. ఐసీసీలో బీసీసీఐ ఆధిపత్యం చెలాయిస్తోందని టాక్ వస్తోంది. అయితే ఐసీసీ కప్‌లలో భారత జట్టు విఫలమవుతూనే ఉంది. 
 
ఐసీసీ సిరీస్‌లో భారత జట్టు ఓటమి గురించి భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ, "ఐసిసి సిరీస్‌లో మేము ప్రతిరోజూ గెలవలేము. కనీసం ఫైనల్స్‌కు అయినా మా జట్టు చేరుతుందని సంతోషించవచ్చు. 
 
ప్రపంచకప్ విజయం రోజు మనం ఎలా రాణిస్తామో దానిపై ఆధారపడి ఉంటుంది. నాకౌట్ మ్యాచ్‌లను ఎలా గెలవాలో కోచ్ ద్రవిడ్, కెప్టెన్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు తెలుసు." అని గంగూలీ తెలిపాడు. 
 
భారత్‌లో అపారమైన ప్రతిభ వుందని.. అదిలేదనడం తరచుగా వింటున్నా. కానీ మన దగ్గర అన్నీ ఎక్కువే వున్నాయి.. నిర్ణయం తీసుకోలేకపోతుండటమే సమస్య. నాలుగో స్థానం గురించి రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మ, సెలెక్టర్లు ఒక నిర్ణయానికి రావాలని తెలిపాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు