విరాట్ కోహ్లీకి రెస్ట్ : టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ

సోమవారం, 27 నవంబరు 2017 (18:36 IST)
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. స్వదేశంలో శ్రీలంకతో జరుగుతున్న క్రికెట్ సిరీస్ తర్వాత అత్యంత కీలకమైన సౌతాఫ్రికా టూర్‌కు భారత జట్టు వెళ్లనుంది. దీంతో బీసీసీఐ జాతీయ సెలెక్టర్లు కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చారు. అదేసమయంలో స్వదేశంలో శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్‌కు భారత కెప్టెన్‌గా రోహిత్ శర్మను ఎంపిక చేశారు. మిగతా టీమ్‌లో మార్పులు చేయలేదు. 
 
త‌మ‌కు అస‌లు విరామం ఇవ్వ‌డం లేద‌ని, వ‌రుస‌గా ఒక సిరీస్ త‌ర్వాత‌ మ‌రోటి ఆడుతూనే ఉన్నామ‌ని విరాట్ కోహ్లీ ఇటీవ‌లే మండిప‌డిన విష‌యం తెలిసిందే. దీన్ని దృష్టిలో ఉంచుకుని సెలెక్టర్లు కోహ్లీకి విశ్రాంతినిచ్చినట్టు తెలుస్తోంది. కాగా, కొత్త జట్టులో సిద్ధార్థ్ కౌల్‌కు జట్టులో చోటుదక్కింది. మూడో టెస్టు కోసం ఎంపిక చేసిన టీమ్‌లోకి శిఖర్ ధావన్ తిరిగొచ్చాడు. విజయ్ శంకర్‌ను కూడా టీమ్‌లో కొనసాగించారు.
 
ఇదిలావుండగా, ప్రస్తుతం స్వదేశంలో పర్యాటక శ్రీలంకతో భారత క్రికెట్ జట్టు క్రికెట్ సిరీస్ ఆడుతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే రెండు టెస్ట్‌లు పూర్తిగా, మూడో టెస్ట్ ఢిల్లీలో ప్రారంభంకానుంది. ఈ సిరీస్‌లో భారత్ ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ టెస్ట్ సిరీస్ తర్వాత వన్డే సిరీస్‌ ప్రారంభంకానుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు