ఓపెనర్గా బరిలోకి దిగిన కేఎల్ రాహుల్ (54), శిఖర్ ధావన్ (52) అర్థసెంచరీలతో శుభారంభాన్నిచ్చారు. తదనంతరం మనీష్ పాండే (31), విరాట్ కోహ్లీ (26)లు మోస్తరుగా రాణించారు. ఇంకా ఫాస్ట్ బౌలర్ సర్దుల్ ఠాగూర్ 8 బంతుల్లో 2 సిక్సర్లు, ఒక బౌండరీతో కలిసి 22 పరుగులు సాధించాడు. ఫలితంగా 20 ఓవర్లలో భారత్ ఆరు వికెట్ల నష్టానికి 201 పరుగులు సాధించింది.
ఈ మ్యాచ్లో నాలుగో ఓవర్కు బంతి విసిరిన యువ బౌలర్ నవదీప్ సైనీ.. యాకర్ బౌలింగ్తో శ్రీలంక వికెట్ కీపర్ పెరెరా వికెట్ను తీసుకున్నాడు. సైనీ విసిరిన బంతికి స్టంప్ చెదిరిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. యార్కర్తో అదరగొట్టి అద్భుతమైన వికెట్ చేజిక్కించుకున్న సైనీకి సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.