విరాట్ కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన జైస్వాల్.. గవాస్కర్ రికార్డుపై కన్ను

సెల్వి

గురువారం, 7 మార్చి 2024 (20:40 IST)
టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మస్తు ఫామ్‌లో వున్నాడు. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో జైస్వాల్ రెండు డబుల్ సెంచరీలతో పరుగుల మోత మోగించిన సంగతి తెలిసిందే. ధర్మశాల టెస్టులోనూ అర్థ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో గవాస్కర్ రికార్డుకు చేరువయ్యాడు. టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగుల రికార్డు ఇప్పటివరకు సునీల్ గవాస్కర్ పేరిట ఉంది. 1970-71లో వెస్టిండీస్ పర్యటనలో గవాస్కర్ 774 పరుగులు చేశాడు. 
 
ప్రస్తుతం జైస్వాల్ ఇంగ్లండ్ తో సిరీస్‌లో 712 పరుగులు చేశాడు. గవాస్కర్ రికార్డుకు జైస్వాల్ మరో 62 పరుగుల దూరంలో ఉన్నాడు. ఈ జాబితాలో రెండో స్థానానికి చేరే క్రమంలో జైస్వాల్... మాజీ సారథి విరాట్ కోహ్లీ (692 పరుగుల) రికార్డును అధిగమించాడు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు