టీమిండియాకు భవిష్యత్తు క్రికెటర్లను అందించేందుకు భారత దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ కంటే మించిన కోచ్ మరొకటు లేడని బీసీసీఐ స్థిర నిర్ణయానికి వచ్చింది. అండర్-19, భారత్-ఏ కోచ్గా ద్రావిడ్ పదవీకాలం ముగియడంతో మరో రెండేళ్లపాటు అండర్-19, భారత్-ఏ జట్లకు సేవలం అందించాలని బీసీసీఐ సూచించింది. ఈ మేరకు ద్రావిడ్ పదవీకాలాన్ని మరో రెండేళ్లపాటు పొడిగిస్తున్నట్లు బీసీసీఐ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో అండర్-19, భారత్-ఏ కోచ్గా మరో రెండేళ్ల పాటు 'మిస్టర్ డిపెండబుల్' ద్రావిడ్ సేవలు అందించనున్నాడు.
2015లో ఈ రెండు విభాగాలకు కోచ్గా ద్రావిడ్ ను నియమించిన విషయం తెలిసిందే. క్లాసిక్ ఆటగాడు ద్రావిడ్ శిక్షణలోని అండర్-19 జట్టు గతేడాది జరిగిన అండర్ 19 వరల్డ్ కప్లో ఫైనల్కు చేరింది. దాంతో ద్రావిడ్పై బీసీసీఐ నమ్మకం బలపడింది. ఐపీఎల్లో అదరగొట్టిన యువ సంచలనాలు రిషబ్ పంత్, సంజూ శాంసన్, కరుణ్ నాయర్ లాంటి క్రికెటర్లు ద్రావిడ్ కోచింగ్తో రాటుదేలారు.