బంగ్లాదేశ్లో విమాన ప్రమాదం సంభవించింది. ఆ దేశ రాజధాని ఢాకాలోని ఉత్తర ప్రాంతంలో ఉన్న మైల్స్టోన్ స్కూల్ అండ్ కాలేజ్ ప్రాంగణంలో సోమవారం ఓ యుద్ధ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో మొత్తం 19 మంది చనిపోయారు. వీరిలో 16 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లు, ఓ పైలెట్ ఉన్నారు. సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో గాయపడిన సంఖ్య తెలియాల్సివుంది.
టీవీ ఫుటేజీ, ఆన్లైన్లో షేర్ చేయబడిన వీడియోలలో ప్రమాదం స్థలం వద్ద మంటలు, పొగ దట్టంగా వెలువడుతూ కనిపించాయి. అత్యవసర సిబ్బంది మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు. ఓ వీడియోలో శిథిలాల కింద కూరుకునిపోయిన విమాన ఇంజిన్ దృశ్యం భీతావహంగా మారిపోయింది.